← Back to news

దాచేపల్లిలో మ్యాజిక్ డ్రైన్‌ నిర్మాణానికి శ్రీకారం

By siva· 1d ago
దాచేపల్లిలో మ్యాజిక్ డ్రైన్‌ నిర్మాణానికి శ్రీకారం

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి పంచాయతీ పరిధిలో జనసేన సీనియర్‌ నాయకుడు నల్లబోతుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మ్యాజిక్ డ్రైన్‌ నిర్మాణం చేపట్టారు. వర్షపాతం తగ్గిపోవడం, భూగర్భజలాలు పడిపోతున్న పరిస్థితుల్లో పవన్‌ కళ్యాణ్‌ సూచించిన విధానంలో మ్యాజిక్ డ్రైన్‌ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. దాచేపల్లిలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వర్షపునీటిని భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ప్రతిఇంటి వద్ద ఇలాంటి డ్రైన్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.