← Back to news

ఈశా గ్రామోత్సవం-2026.. విజేతలు వీరే

By dk· 17 Aug 2026· హైదరాబాద్
ఈశా గ్రామోత్సవం-2026.. విజేతలు వీరే

TG: గ్రామీణ క్రీడాకారులను ఒక్కతాటిపైకి తీసుకురావడమే ఈశా గ్రామోత్సవం-2026 లక్ష్యమని ఈశా యోగా కేంద్రం సమన్వయకర్త స్వామి అంబర తెలిపారు. హైదరాబాద్‌ LB స్టేడియంలో జరిగిన మహిళల త్రోబాల్‌, పురుషుల వాలీబాల్‌ రాష్ట్రస్థాయి ఫైనల్‌ పోటీలు ఉత్కంఠగా సాగాయి. రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన 9,600 మందికి పైగా గ్రామీణ క్రీడాకారులు టోర్నమెంట్‌లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. మహిళల త్రోబాల్‌లో కోయచల్క వారియర్స్‌, పురుషుల వాలీబాల్‌లో రంగారెడ్డి జిల్లా దేవుని పడకల్‌ జట్లు రాష్ట్ర ఛాంపియన్లుగా నిలిచాయి.

More in Sports