← Back to news

మందసలో రూ.1.20 కోట్ల బ్రిడ్జిల తనిఖీ

By K. PURNA CHANDU. Senior Journalist.· 1d ago· Palasa, Palasa, Srikakulam
మందసలో రూ.1.20 కోట్ల బ్రిడ్జిల తనిఖీ

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో చీపి–బుడంబో, దాలసరి–బుడంబో మధ్య రూ.60 లక్షల చొప్పున రెండు బ్రిడ్జిలు నిర్మించారు. ఐటీడీఏ ఈఈ రమాదేవి గురువారం వాటి క్వాలిటీ, మెటీరియల్ ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యత నిర్ధారణ అనంతరమే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ బ్రిడ్జిలతో గ్రామాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందని, రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.