← Back to news

జీరుగెడ్డలో 19 మంది రైతులకు జీరాయితీ పట్టాల పంపిణీ

By Sivaji· 1d ago· Ananthagiri, Ananthagiri, Alluri Sitharama Raju
జీరుగెడ్డలో 19 మంది రైతులకు జీరాయితీ పట్టాల పంపిణీ

అల్లూరి సీతారామరాజు జిల్లా బొర్రా పంచాయతీ జీరుగెడ్డలో గురువారం రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా 19 మంది రైతులకు జీరాయితీ పట్టాలు అందజేశారు. పట్టాలు పొందిన రైతులు రైతు భరోసా కేంద్రంలో ఆన్లైన్లో నమోదు చేసుకుంటే రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు వర్తిస్తాయని సర్పంచ్, ఎంపీటీసీ సూచించారు. పెసా కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, స్థానికులు పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.