సీఎం సర్.. మా డబ్బులు మాకివ్వండి! DPలతో ఉద్యమం

AP రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. పీ ఐకాస నేతలు బొప్పరాజు, వెంకటేశ్వర్లు, పలిశెట్టి, దామోదరరావు సోమవారం జిల్లా కలెక్టర్లకు నోటీసులు అందజేశారు. సెప్టెంబర్ 1 నుంచి 'సీఎం సర్.. మా డబ్బులు మాకు ఇవ్వండి' అనే నినాదాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 15వ తేదీ నుంచి వర్క్ టు రూల్ చేపడతామని ప్రకటించారు.<br>తమ సమస్యల పరిష్కారం కోసం ఇది తొలిదశ కార్యాచరణ అని స్పష్టం చేశారు.



