← Back to news

వైఎస్ జ్ఞాపకాలు.. మందమర్రిలో ఘన నివాళి!

By RAJKUMAR· 2d ago· Mandamarrri, Mandamarri, Mancherial
వైఎస్ జ్ఞాపకాలు.. మందమర్రిలో ఘన నివాళి!

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని 11వ వార్డులో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, జిల్లా అధ్యక్షుడు నంది పాట రాజుకుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ.. ’’పావలా వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఆయనే తీసుకొచ్చారు. నాయకులు వస్తారు.. పోతారు.. కానీ వైఎస్ జ్ఞాపకాలు మాత్రం శాశ్వతం!’’ అని ఆయన అన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.