వైఎస్ జ్ఞాపకాలు.. మందమర్రిలో ఘన నివాళి!

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని 11వ వార్డులో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, జిల్లా అధ్యక్షుడు నంది పాట రాజుకుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ.. ’’పావలా వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఆయనే తీసుకొచ్చారు. నాయకులు వస్తారు.. పోతారు.. కానీ వైఎస్ జ్ఞాపకాలు మాత్రం శాశ్వతం!’’ అని ఆయన అన్నారు.



