రూ.12 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.12 వేల కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగనమోని బంగారు బాబు డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్లోని MRO కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం ఏబీవీపీ నాయకులు డిప్యూటీ MROకు వినతిపత్రం అందజేశారు.



