22 మంది Indians ఉన్న రెండు నౌకలు హైజాక్

సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు నౌకలు హైజాక్ కావడంతో 22 మంది భారతీయ నావికుల భద్రతపై ఆందోళన మొదలైంది. యెమెన్, సోమాలియా తీరాల దగ్గర జరిగిన వేర్వేరు ఘటనల్లో MT Sibuలో 16 మంది, MV Lutufలో 6 మంది భారతీయులు ఉన్నారు. ఆయుధాలతో వచ్చిన సముద్ర దొంగలు నౌకలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం మొత్తం 22 మంది భారతీయ నావికులు సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. భారత్ సోమాలియా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.



