కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ కార్యక్రమాలు

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టనుంది. ఏడు రోజుల పాటు నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలపై కార్యక్రమాలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, విద్యార్థులు, రైతుల సమస్యలను ప్రధానంగా తీసుకుని గ్రామస్థాయి నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.



