విద్యార్థులకు హెచ్ఐవీపై అవగాహన

AP: కోనసీమ జిల్లా కొత్తపేట మండలం చప్పిడివారిపాలెం హైస్కూల్లో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ నిర్వహించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనలతో దిశా ఆధ్వర్యంలో, లింక్ వర్కర్ స్కీం పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. హెచ్ఎం కె.అరుణశ్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొత్తపేట సామాజిక ఆరోగ్య కేంద్రం ఐసీటీసీ కౌన్సిలర్ జి.గీతాంజలి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే హెచ్ఐవీపై అవగాహన కలిగి, సరైన చికిత్స పొందితే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చన్నారు.



