బెస్ట్ తెలుగు సినిమాగా 'కమిటీ కుర్రోళ్లు'..

కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని అనౌన్స్ చేసింది. 2024 సంవత్సరానికి గాను ఇచ్చిన ఈ అవార్డ్స్ లో 'కమిటీ కుర్రోళ్లు' మూవీ 'బెస్ట్ తెలుగు ఫిల్మ్' అవార్డ్ గెలుచుకుంది. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ మూవీకి యదు వంశీ డైరెక్టర్. 1990ల నాటి విలేజ్ మెమొరీస్, పల్లెటూరి వాతావరణాన్ని చాలా బ్యూటిఫుల్ గా చూపించిన ఈ సినిమా ఇప్పుడు నేషనల్ లెవెల్ లో క్రేజీ రికార్డ్ కొట్టింది.



