దిల్లీలో పెద్ద సంఖ్యలో ఓటర్లు గల్లంతు

దిల్లీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా వచ్చింది. మొత్తం 1.45 కోట్ల ఓటర్లలో దాదాపు 47.5 లక్షల మంది పేర్లు ఇప్పుడు జాబితాలో లేవు. అంటే ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతయ్యింది. 70 నియోజకవర్గాల్లో ఏడు చోట్ల ఒక్కో చోట లక్షకు పైగా పేర్లు తగ్గాయి. ఐదు నియోజకవర్గాల్లో 2025 ఎన్నికల్లో ఉన్న ఓటర్లలో 40 శాతానికి పైగా పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో లేకపోవడం విచిత్రం. ఈ ఐదింటిలో మూడు ఆప్ గెలవడా, రెండు బీజేపీ గెలిచింది.


