← Back to news

డ్రైనేజీ లీకేజీతో రోడ్డుపై మురుగునీరు

By Maabaji Sk· 1d ago

AP: గుంటూరు పట్టణంలోని డొంక రోడ్డు మూడు వంతెనల కింద గత నాలుగైదు రోజులుగా డ్రైనేజీ లీకేజీతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వల్ప వర్షం కురిసినా వంతెనల కింద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. దుర్వాసనతో పాటు పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు స్పందించి డ్రైనేజీ లీకేజీని అరికట్టి, నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.