నేడు వెలిగొండకు సీఎం చంద్రబాబు.. ప్రాజెక్ట్ ఓపెనింగ్

AP: చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మార్కాపురం జిల్లా, వెలిగొండ ప్రాజెక్టు కల నేడు నిజం కానుంది. CM చంద్రబాబు నాయుడు ఈరోజు Phase-Iను ప్రారంభించి 10.70 TMC కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. ఈ Phase-Iతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. 6 వేల మంది మహిళలకు చీర, గాజులు, పసుపు, కుంకుమతో ప్రత్యేక కిట్లు ఇవ్వనున్నారు. షిఫ్ట్ అవుతున్న కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.



