చేయూత పెన్షన్కు గడువు పొడిగింపు..! సెప్టెంబర్ 15 వరకే

అయిజ మున్సిపాలిటీలో చేయూత పెన్షన్ దరఖాస్తుదారులకు శుభవార్త. Aug 31తో ముగియాల్సిన గడువును ప్రభుత్వం Sept 15 వరకు పొడిగించింది. ఈ పెన్షన్ కింద వితంతువు, వికలాంగత, ఒంటరి మహిళ, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ రోగులు అర్హులే. ఇప్పటివరకు మున్సిపాలిటీ పరిధిలో 494 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇంకా అర్హత ఉన్నవాళ్లు ఎవరైనా అప్లై చేయకుంటే, ఇదే వారి చివరి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పి. చంద్రశేఖర్ రావుస్పష్టంగా కోరారు. ఇక డేట్ మిస్ అయితే.. మీరే బాధ్యులు!



