← Back to news

చేయూత పెన్షన్‌కు గడువు పొడిగింపు..! సెప్టెంబర్ 15 వరకే

By VEMANNA· 3d ago
చేయూత పెన్షన్‌కు గడువు పొడిగింపు..! సెప్టెంబర్ 15 వరకే

అయిజ మున్సిపాలిటీలో చేయూత పెన్షన్ దరఖాస్తుదారులకు శుభవార్త. Aug 31తో ముగియాల్సిన గడువును ప్రభుత్వం Sept 15 వరకు పొడిగించింది. ఈ పెన్షన్ కింద వితంతువు, వికలాంగత, ఒంటరి మహిళ, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ రోగులు అర్హులే. ఇప్పటివరకు మున్సిపాలిటీ పరిధిలో 494 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇంకా అర్హత ఉన్నవాళ్లు ఎవరైనా అప్లై చేయకుంటే, ఇదే వారి చివరి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పి. చంద్రశేఖర్ రావుస్పష్టంగా కోరారు. ఇక డేట్ మిస్ అయితే.. మీరే బాధ్యులు!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.