డాక్టర్లు వాడే కెమెరాతో క్వశ్చన్ పేపర్ లీక్!

ఛత్తీస్గఢ్లో అగ్రికల్చర్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో ఒక ప్రొఫెసర్తో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుర్గ్లోని భారతి అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న యోగేష్ సొంకేసరియా.. ఎండోస్కోప్ కెమెరా, నీడిల్ ఉపయోగించి క్వశ్చన్ పేపర్ను లీక్ చేశాడు. ఎగ్జామ్కి ఒక్క రోజు ముందే ఎంటమాలజీ పేపర్ను విద్యార్థులకు రూ. 11,000కి అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వర్సిటీ ఆ పరీక్షను క్యాన్సిల్ చేసి, మళ్లీ రీ-టెస్ట్ conduct చేస్తం అని అనౌన్స్ చేసింది.



