ఫరూఖ్నగర్లో నేడు బ్లడ్ డొనేషన్ క్యాంప్

TG: ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ & యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఆగస్టు 26న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ వాటర్ ట్యాంక్ వద్ద శిబిరం జరగనుంది. ‘బీ ఎ హీరో.. డొనేట్ బ్లడ్, సేవ్ లైవ్స్’ అనే సందేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.



