← Back to news

దాచేపల్లిలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

By siva· 2h ago
దాచేపల్లిలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో మండల పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ ఖాజావలి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్ల ప్రవర్తన, కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవించాలని సీఐ సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే గొడవలు, వివాదాలు, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. యువతను చెడు మార్గాల్లోకి తీసుకెళ్లే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 7m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.