అరకులోయలో 28 డిగ్రీల ఉష్ణోగ్రత

ఎల్ నినో బలపడటంతో అరకులోయలో మధ్యాహ్నం 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతతో పర్యాటకులు, స్థానికులు నీడను ఆశ్రయిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో గిరిజన ప్రాంతాల్లో వరి పంట విస్తీర్ణం తగ్గింది. నీరు లేక రైతులు పంటపై ఆశలు వదులుకున్నారు. IMD ప్రకారం రాబోయే 2-3 రోజులు వేడి కొనసాగే అవకాశం ఉంది.


