లింగంపేట్కు గుడ్ న్యూస్.. రూ.4.50 కోట్ల బ్రిడ్జి!

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దుందుభి నదిపై రూ.4.50 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. దీంతో గ్రామస్తుల రాకపోకలు సులభతరం కానున్నాయి. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ యాదవ్, సర్పంచ్ బాలస్వామి, డిప్యూటీ గోపి, కుమార్ నాగరాజు పాల్గొన్నారు.





