← Back to news

నేలబావిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

By siva· 2h ago
నేలబావిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి శివారులోని పల్లా నాగయ్య నేలబావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బావిలో మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ వెంకట్రావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. మృతుడి వయస్సు సుమారు 46 ఏళ్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రావు వెల్లడించారు.

More in Local

ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు
Local· just now

ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

TG: వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లబెల్లి గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.