కేంద్ర ప్రభుత్వంపై సీనియర్ నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ వాహనదారులకు గుండెపోటు తెప్పిస్తోందని నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సానుభూతిపరుడైన తన మిత్రుడు కొత్తగా కొనుగోలు చేసిన టయోటా క్యామ్రీకి ఇథనాల్ పెట్రోల్ వాడటంతో ఇంజిన్ వాల్వ్స్ దెబ్బతిన్నాయన్నారు. అందుకే తనూ లీటరుకు రూ.165 ఖర్చుతో హై ఆక్టేన్ 100 పెట్రోల్కు మారాల్సి వచ్చిందని చెప్పారు. సాధారణ వాహనదారుల పరిస్థితి ఏంటని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.


