ఇస్లాంపేట పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

పెదగంట్యాడ మండలం ఇస్లాంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజ అభివృద్ధికి మంచి విద్యార్థులను తయారు చేయడమే ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.




