← Back to news

విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో మలుపు..!

By Adithya· 12h ago· Farooqnagar (Ct), Farooqnagar, Ranga Reddy
విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో మలుపు..!

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్‌లో ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. గురుకుల పాఠశాల వసతి గృహంలో బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా బాలిక తండ్రి పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. తమ కూతురి బంధువు రమేష్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. దీంతో పోలీసులు రమేష్‌పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే అధ్యాపకుల వేధింపుల ఆరోపణలతో ఇంగ్లీష్ లెక్చరర్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు కొత్త ఆరోపణలతో విచారణ మరో కోణంలో సాగుతోంది. ఈ కేసులో నిందితులెవరనేది తేలాల్సి ఉంది.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.