27 ఏళ్లకే మార్కెట్లోకి ఎంట్రీ..

కొన్నేళ్ల క్రితం వరకు మన దేశంలో యావరేజ్గా 29 ఏళ్లకు ఇన్వెస్టింగ్ మార్కెట్లోకి అడుగుపెట్టేవాళ్లు. కానీ ఎన్ఎస్ఈ(NSE) తాజా రిపోర్ట్ ప్రకారం, ఇప్పుడు ఆ వయసు 27 ఏళ్లకు తగ్గింది. దీనికి కారణం ఇన్వెస్ట్మెంట్ విషయంలో వచ్చిన మైండ్సెట్ మార్పే! గత జనరేషన్ దాచుకోగా మిగిలిన డబ్బులనే ఇన్వెస్ట్ చేసేవాళ్లు. యంగ్ ఇన్వెస్టర్స్ మొదటే ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాతే మిగిలినవి ఖర్చు చేస్తున్నారు. చిన్న వయసులోనే ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేయడంలో ఇదొక కొత్త మార్పు.
