సంచార జాతుల అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్

సంచార, విముక్త జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో 75వ విముక్తి దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా యువతను ఆర్థికంగా స్వావలంబన దిశగా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.చెన్నయ్య, అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



