← Back to news

సంచార జాతుల అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్

By Srinivas· 4d ago
సంచార జాతుల అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్

సంచార, విముక్త జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో 75వ విముక్తి దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా యువతను ఆర్థికంగా స్వావలంబన దిశగా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.చెన్నయ్య, అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.