విద్యార్థిని ఆత్మహత్యకు వేధింపులే కారణమంటూ LHPS ధర్నా

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని ఆత్మహత్యకు ప్రిన్సిపల్, అధ్యాపకుల వేధింపులే కారణమని లంబాడి హక్కుల పోరాట సమితి ఆరోపించింది. గురువారం కళాశాల ముందు ధర్నా నిర్వహించి, విచారణ, చర్యలు డిమాండ్ చేశారు. LHPS అధ్యక్షుడు రాంబల్ నాయక్ బాలిక కుటుంబానికి న్యాయం చేసేదాకా పోరాడతామని హెచ్చరించారు.



