సీనియర్ జర్నలిస్టు సురేందర్రెడ్డికి ఘన నివాళి

TG: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన సీనియర్ జర్నలిస్టు తాళ్లపల్లి సురేందర్రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో నర్సంపేట ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నివాళులర్పించారు. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద సురేందర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జర్నలిజం రంగానికి ఆయన అందించిన సేవలను జర్నలిస్టులు స్మరించుకున్నారు. వృత్తిపట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తుచేసుకున్నారు.



