← Back to news

సీనియర్ జర్నలిస్టు సురేందర్‌రెడ్డికి ఘన నివాళి

By A VIJAY KUMAR· 2d ago· Warangal
సీనియర్ జర్నలిస్టు సురేందర్‌రెడ్డికి ఘన నివాళి

TG: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన సీనియర్ జర్నలిస్టు తాళ్లపల్లి సురేందర్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో నర్సంపేట ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నివాళులర్పించారు. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద సురేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జర్నలిజం రంగానికి ఆయన అందించిన సేవలను జర్నలిస్టులు స్మరించుకున్నారు. వృత్తిపట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తుచేసుకున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.