కాంగ్రెస్ vs BJP.. జర్నలిస్ట్పై రాళ్లదాడి!
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్, BJP కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను కవర్ చేస్తున్న ఒక న్యూస్ రిపోర్టర్కి రాయి తగలడంతో తలకు తీవ్ర గాయమై రక్తం కారింది. గాయపడినప్పటికీ ఆ విలేకరి స్పాట్ నుంచే కవరేజ్ కొనసాగించడం గమనార్హం. కాగా, రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


