← Back to news

రాష్ట్రంలో రూ.50కే కిలో రైస్ పథకం ప్రారంభం

By Mahesh· 3 Aug 2026· AP
రాష్ట్రంలో రూ.50కే కిలో రైస్ పథకం ప్రారంభం

AP: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరలకు బియ్యం అమ్మకాలను ప్రారంభించింది. రాష్ట్రంలో 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడ APIIC రైతు బజార్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. BPT సూపర్ ఫైన్ రైస్ కిలో రూ.52, బీపీటీ రా రైస్ కిలో రూ.50కు అమ్మగా, ఆధార్ అథెంటికేషన్‌తో ఒక్కో వ్యక్తి మ్యాక్సిమమ్ 10 కిలోలు కొనుక్కోవచ్చు.

More in Politics