← Back to news

డ్రెయిన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

By epuri rajaratnam· 4d ago
డ్రెయిన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

AP: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రెయిన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ అలీమ్ బాషా తెలిపారు. మార్కండేయ కాలనీలోని టిడ్కో ప్రాంతంలో డ్రెయిన్లను పరిశీలించిన ఆయన కాజా ఈస్ట్ లేక్ వాకింగ్ ట్రాక్, బాప్టిస్ట్‌పేటకు అనుసంధానమైన డ్రెయిన్‌ను ఇంజినీరింగ్, ఉద్యానవన విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కండేయ కాలనీ టిడ్కో వద్ద డ్రెయిన్ల పరిస్థితి, నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కమిషనర్ నీటి పారుదల సక్రమంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.