ఫ్లాష్ ఫ్లడ్స్ తర్వాత భూకంపం.. టిబెట్లో హై అలర్ట్!

భారీ వరదలతో అల్లాడుతున్న టిబెట్లో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 5.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. నేపాల్ బోర్డర్ ప్రాంతంలో ఇటీవల భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం సృష్టించిన కొద్ది రోజులకే ఈ భూకంపం రావడంతో టెన్షన్ నెలకొంది. వరదలతో ఇప్పటికే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. తాజాగా భూకంపంతో అధికారులు అలర్ట్ అయ్యారు. భూకంపం వల్ల ఆస్తి, ప్రాణనష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు సిట్యుయేషన్ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు.



