← Back to news

వరంగల్ కమిషనరేట్‌లో 22 మంది సీఐల బదిలీలు

By prabhakar kodepaka· 3d ago· వరంగల్ జిల్లా
వరంగల్ కమిషనరేట్‌లో 22 మంది సీఐల బదిలీలు

TG: వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 22 మంది సీఐలకు బదిలీలు, కొత్త పోస్టింగ్లు కల్పిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లాతో పాటు కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాలకు అధికారులను కేటాయించారు. ఎస్. శ్రీనివాస్‌ను స్టేషన్‌ఘన్‌పూర్‌, జి. వేణును రఘునాథపల్లి, పి. దేవేందర్‌ను నర్మెట్ట, భరత్‌ సుమన్‌ను పాలకుర్తి, ఎ. ప్రవీణ్‌కుమార్‌ను పరకాల, అనుముల శ్రీనివాస్‌ను ధర్మసాగర్‌, జి. బాబులాల్‌ను ఆత్మకూర్‌, ఆర్. సంతోష్‌ను పర్వతగిరి, కె. శ్రీనును ఎల్కతుర్తి సీఐలుగా నియమించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.