పల్నాడులో కరువు పరిస్థితులపై అలర్ట్

పల్నాడు జిల్లాలో వర్షాభావంతో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని Nature Welfare Council AP చైర్మన్ అంబటి నవకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు, పశువులకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతోందని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ వనరుల ద్వారా ట్యాంకర్ల సరఫరా, చెరువులు-కాలువల రీచార్జ్ చర్యలు చేపట్టాలని, కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కోరారు.



