స్కూల్ మునిగిపోయింది... కానీ 1,643 మంది సేఫ్!
నేపాల్లోని త్రిశూలి నదిలో 30 మీటర్ల ఎత్తులో వచ్చిన భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ త్రిభువన్ త్రిశూలి స్కూల్ను ముంచెత్తాయి. ప్రిన్సిపాల్ రాజేంద్ర దాదాబీ సమయస్ఫూర్తితో 1,643 మంది స్టూడెంట్స్ సేఫ్గా బయటపడ్డారు. ఊరు కొట్టుకుపోతోందని ఫ్రెండ్ నుండి అలర్ట్ రాగానే, ఆయన వెంటనే స్కూల్ బెల్ కొట్టి పిల్లలను ఎత్తైన ప్రదేశానికి పంపారు. వస్తున్న స్కూల్ బస్ డ్రైవర్లకు ఫోన్ చేయడంతో, బ్రిడ్జ్ కూలిపోయే ముందే బస్ సేఫ్గా క్రాస్ అయింది. దాదాబీ చూపిన సమయస్ఫూర్తిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



