ఇస్కాన్ ఫుడ్ సెంటర్లకు షాక్..!

మహారాష్ట్రలో తుకారాం ముండే ఎఫెక్టుతో.. FDA రంగంలోకి దిగింది. ముంబైలో ఆహార భద్రతా రూల్స్ పాటించని వారిపై సీరియస్ యాక్షన్ మొదలుపెట్టింది. రైల్వే ప్రయాణికులకు ఆహారం అందించే IRCTC కిచెన్తో పాటూ, జుహూలోని ఇస్కాన్కు చెందిన 3 ఫుడ్ సెంటర్ల లైసెన్సులను కూడా సస్పెండ్ చేసింది. FDA తనిఖీల్లో.. వంటగదుల్లో బొద్దింకలు, ఎలుకల ఆనవాళ్లు గుర్తించడంతోపాటూ ఆహారాన్ని తెరిచి ఉంచడం, చెత్త దగ్గర్లో వంట చేయడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.



