లక్ష్మణరేఖ దాటితే ఎవరికైనా ఇదే గతి: ఎంపీ మల్లు రవి

నాగర్కర్నూల్ ఎంపీ, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యయుతమేనని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రెండుసార్లు వివరణ విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలిగించే బహిరంగ వ్యాఖ్యలు సరికాదని పేర్కొంటూ.. "లక్ష్మణరేఖ దాటితే ఎవరికైనా ఇదే గతి" అంటూ హెచ్చరించారు.



