← Back to news

లక్ష్మణరేఖ దాటితే ఎవరికైనా ఇదే గతి: ఎంపీ మల్లు రవి

By Srinivas· 1d ago
లక్ష్మణరేఖ దాటితే ఎవరికైనా ఇదే గతి: ఎంపీ మల్లు రవి

నాగర్కర్నూల్ ఎంపీ, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యయుతమేనని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రెండుసార్లు వివరణ విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలిగించే బహిరంగ వ్యాఖ్యలు సరికాదని పేర్కొంటూ.. "లక్ష్మణరేఖ దాటితే ఎవరికైనా ఇదే గతి" అంటూ హెచ్చరించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.