మంత్రిని కలిసిన షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు

రేగిడి మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిశారు. చెరుకు రైతుల సమస్యను ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎల్ నినో ప్రభావం వల్ల 202-28 క్రాషింగ్ సీజన్ను మూసేస్తున్నట్టు సంకిలి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించడంతో రైతులు పడుతున్న ఇబ్బందిని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే సంకిలి షుగర్ ఫ్యాక్టరీ జి.ఎంకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.



