← Back to news

ఆదివాసీ హక్కుల కోసం.. సెప్టెంబర్ 6న ఛలో ఢిల్లీ!

By Dev· 2d ago
ఆదివాసీ హక్కుల కోసం.. సెప్టెంబర్ 6న ఛలో ఢిల్లీ!

ఆంధ్రప్రదేశ్ ఆదివాసీలు హక్కుల కోసం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. 1/70 భూ బదలాయింపు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 2000లో వచ్చిన జీఓ-3కి బదులుగా కొత్త జీఓ జారీ చేయాలని కోరుతున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల అక్రమ ఒప్పందాల జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ’’అడవి, భూమి, నీటిపై ఆదివాసీలకే సర్వహక్కులు ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. సర్కారు ఉల్లంఘిస్తోంది. అందుకే సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింద’’ని నాయకులు చెప్పారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.