ఆదివాసీ హక్కుల కోసం.. సెప్టెంబర్ 6న ఛలో ఢిల్లీ!

ఆంధ్రప్రదేశ్ ఆదివాసీలు హక్కుల కోసం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. 1/70 భూ బదలాయింపు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 2000లో వచ్చిన జీఓ-3కి బదులుగా కొత్త జీఓ జారీ చేయాలని కోరుతున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల అక్రమ ఒప్పందాల జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ’’అడవి, భూమి, నీటిపై ఆదివాసీలకే సర్వహక్కులు ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. సర్కారు ఉల్లంఘిస్తోంది. అందుకే సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింద’’ని నాయకులు చెప్పారు.



