← Back to news

"యువతను భయపెట్టలేరు".. మోదీ సర్కార్‌పై ఖర్గే ఫైర్

By Nani· 27 Jul 2026· X
"యువతను భయపెట్టలేరు".. మోదీ సర్కార్‌పై ఖర్గే ఫైర్

NEET-UG ఉద్యమంలో పాల్గొన్న యువతను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తన X పోస్టులో, "లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్లను కూడా చెక్ చేస్తున్నారు. ఇవన్నీ భయపడుతున్న ప్రభుత్వ లక్షణాలు" అని అన్నారు. అలాగే పేపర్ లీక్‌లను అరికట్టే చట్టం ఏమైంది? NTAకి ఇన్ని రోజులు పూర్తి స్థాయి డైరెక్టర్ ఎందుకు లేరు? అంటూ ప్రశ్నలు సంధించారు. చివరగా అమిత్ షా దీనిపై సమాధానం చెప్పాలని, ప్రధాని మోదీ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

More in Politics