సత్తెనపల్లిలో పేకాట క్లబ్పై దాడి

AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో అనధికారంగా నిర్వహిస్తున్న పేకాట క్లబ్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. క్లబ్లోని అద్దాలు, ఫర్నీచర్, బీరువా, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇటీవల పేకాట ఆడేందుకు వచ్చిన వారిని వీడియో తీస్తున్నారనే కారణంతో క్లబ్ నిర్వాహకులు కొందరిపై దాడిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.



