అందుకే ప్రతిపక్షం సభలో లేదు: సీఎం రేవంత్

ప్రజాపాలన పేదల కోసమే ఉందన్నారు సీఎం రేవంత్. 22A భూముల అంశంపై.. అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన ఆయన.. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ముందే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం "ఉద్దేశపూర్వగంగా ప్రభుత్వం పేదల్ని వేధిస్తోంది" అని అసత్య ప్రచారం చేస్తున్నాయని సీఎం అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలపై, గత ప్రభుత్వం భూముల్ని కొల్లగొట్టిన అంశాలపై సభలో చర్చ జరగకూడదనే ఉద్దేశంతోనే విపక్షాలు సభను అడ్డుకున్నాయనీ, అందుకే సభలో లేవని సీఎం రేవంత్ అన్నారు.


