ఐటీడీఏ ఎదుట గ్రామస్తుల ధర్నా

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఏఆర్ పురం మండలం వడ్డిగూడెం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. పోలవరం పునరావాసంలో భాగంగా తమ గ్రామానికి తూర్పుగోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కొత్తపల్లిని కేటాయించారని గ్రామస్తులు తెలిపారు. అయితే కొత్తపల్లి తమకు అనుకూలంగా లేదని, అక్కడికి తరలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమీప గ్రామాల బంధువులకు ఏలూరు జిల్లా తాడువాయి, కొయ్యలగూడెం ప్రాంతాల్లో పునరావాసం కల్పించారని, తమను కూడా అదే ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలని కోరారు.




