← Back to news

ఐటీడీఏ ఎదుట గ్రామస్తుల ధర్నా

By MD ALI· 2d ago
ఐటీడీఏ ఎదుట గ్రామస్తుల ధర్నా

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఏఆర్ పురం మండలం వడ్డిగూడెం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. పోలవరం పునరావాసంలో భాగంగా తమ గ్రామానికి తూర్పుగోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కొత్తపల్లిని కేటాయించారని గ్రామస్తులు తెలిపారు. అయితే కొత్తపల్లి తమకు అనుకూలంగా లేదని, అక్కడికి తరలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమీప గ్రామాల బంధువులకు ఏలూరు జిల్లా తాడువాయి, కొయ్యలగూడెం ప్రాంతాల్లో పునరావాసం కల్పించారని, తమను కూడా అదే ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలని కోరారు.

ఐటీడీఏ ఎదుట గ్రామస్తుల ధర్నా

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 59m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.