← Back to news

బాడీ షేమింగ్‌ ట్రోల్స్ ఎదుర్కొన్న ఉపాసన

By A.Ajay· 1h ago
బాడీ షేమింగ్‌ ట్రోల్స్ ఎదుర్కొన్న ఉపాసన

ఒకప్పుడు బాడీ షేమింగ్‌ ట్రోల్స్ తనను ఎంతో బాధించాయని ప్రముఖ వ్యాపారవేత్త, రామ్ చరణ్ భార్య ఉపాసన తెలిపారు. విద్యార్థి దశలో స్ట్రెస్ కారణంగా ఎక్కువగా తినడంతో 95 కిలోల బరువున్నట్లు చెప్పారు. పెళ్లి తర్వాత బరువు తగ్గేందుకు ఎన్నో డైట్ ప్లాన్స్ ప్రయత్నించినా మొదట్లో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ఆ తర్వాత రోజూ వాకింగ్, ఓట్స్‌, ప్రొటీన్‌ పెంచడం వంటి మార్పులతో బరువు తగ్గినట్లు వెల్లడించారు. శరీరాన్ని ప్రేమిస్తూ మంచి లైఫ్‌స్టైల్ అలవర్చుకోవడమే బాడీ షేమర్లకు సరైన సమాధానమని చెప్పారు.

More in Entertainment