BRICS సమ్మిట్ కోసం బస్తీని దాచేశారు!

ఢిల్లీలోని వసంత్ విహార్లో ఉన్న కూలీ క్యాంప్ బస్తీని BRICS సమ్మిట్ కోసం బ్లూ, వైట్ బ్యానర్లతో కప్పేశారు. అక్కడి వాళ్లు చెబుతున్నదేంటంటే.. G20 సమ్మిట్ సమయంలోనూ ఇలాగే తమ ఇళ్లను తెరల వెనక దాచారట. “పేదరికం సమస్య అయితే, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయకుండా మమ్మల్నే ఎందుకు దాచాలి? నగరాన్ని అందంగా చూపించేందుకు మేము కనిపించకుండా ఉండాలా?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

