← Back to news

అత్యాచార కేసులో నిందితులపై కఠిన శిక్షలు

By .· 1d ago
అత్యాచార కేసులో నిందితులపై కఠిన శిక్షలు

నారాయణపేట జిల్లా మక్తల్ లో మహిళపై అత్యాచారం, కత్తిపోటు ఘటనలో ఇద్దరు అరెస్ట్ కాగా, కేసులో 70(1) BNS సెక్షన్ మాత్రమే నమోదు చేయడంపై దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి ఇల్లు, వితంతు పింఛన్ మంజూరు చేయాలని, ఆమె కుమారుడికి ప్రత్యేక విద్య అందించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.