వరుస బంగారు చోరీ కేసులు ఛేదింపు.. నిందితుడి అరెస్ట్

AP: శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం రూరల్ పోలీసులు బంగారు ఆభరణాల చోరీ కేసులను ఛేదించారు. సోంపేట మండలం ఇసుకలపాలెంకు చెందిన వాసుపల్లి తాతారావును అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.39 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.28.43 లక్షలు కాగా, నగదుతో కలిపి మొత్తం రికవరీ విలువ రూ.28.82 లక్షలుగా ఉందని కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని తెలిపారు. ఇచ్చాపురం రూరల్, కవిటి, బారువ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఏడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు.



