← Back to news

సంగెం విద్యాభారతిలో కృష్ణాష్టమి వేడుకలు

By VIJAY· 1d ago· Sangam, Sangem, Warangal

హన్మకొండ జిల్లా సంగెం మండలంలోని విద్యాభారతి పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినీ, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషాల్లో అలరించారు. సంప్రదాయ దుస్తుల్లో చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు పండుగ విశిష్టతను వివరించారు. పాఠశాలలో సందడి నెలకొంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రదర్శనలను ఆస్వాదించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.