సంగెం విద్యాభారతిలో కృష్ణాష్టమి వేడుకలు
హన్మకొండ జిల్లా సంగెం మండలంలోని విద్యాభారతి పాఠశాలలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినీ, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషాల్లో అలరించారు. సంప్రదాయ దుస్తుల్లో చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు పండుగ విశిష్టతను వివరించారు. పాఠశాలలో సందడి నెలకొంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రదర్శనలను ఆస్వాదించారు.



