ఫేషియల్ స్కాన్లతో ఓల్డ్ క్రిమినల్స్ గుర్తింపు

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనల్లో 2,873 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఫేషియల్ రికగ్నిషన్ (Facial Recognition) సిస్టమ్ ద్వారా పోలీసులు గుర్తించారు.CCTV దృశ్యాలను విశ్లేషించగా, వీరిలో 989 మంది హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ , పోక్సో (POCSO) వంటి తీవ్రమైన నేరాల్లో ప్రమేయం ఉన్న పాత నేరస్థులని పోలీసు వర్గాలు వెల్లడించాయి.



