← Back to news

శ్రీలంక సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం

By rk· 2 Aug 2026
శ్రీలంక సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం

శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. మొదట BCCI ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల టీమ్‌లో అతడి పేరు ఉన్నా, హెల్త్‌ను చూసి ఆడిస్తామని చెప్పారు. బుమ్రా ఫిట్‌నెస్ టెస్టు పాస్ అయ్యాడని మొన్న వార్తలు వచ్చాయి. కానీ, డాక్టర్లు చేసిన పరీక్షల్లో అతడి ఎడమ మోకాలిలో ఇంకా నొప్పి ఉన్నట్లు తేలింది. దీంతో రిస్క్ వద్దని, పూర్తిగా తగ్గేదాకా రెస్ట్ తీసుకోమని BCCI సూచించింది.

More in Sports